కరోనా ముప్పు తొలగలేదు
July 04, 2021
0
కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించారు. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారాయన. తక్కువ మందికి వ్యాక్సిన్లు వేసిన దేశాల్లో ఇది విజృంభిస్తోందని, ఆస్పత్రుల్లో చేరే కోవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని, ఇప్పటికీ ఏ దేశం కూడా ఈ ప్రమాదం నుంచి బయట పడలేదన్నారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమైందని, వైరస్ కాల క్రమేణా మారుతున్నందున దానిపై పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్లను వంద దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కోవిడ్ బారినపడకుండా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం ఎంతో కీలకం అన్నారు. ఇళ్లకు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.