ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌పై దర్యాప్తు

Telugu Lo Computer
0


ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను జగన్ సర్కార్ కోరింది. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో తాజాగా సీఐడీకి విచారణను అప్పగిస్తూ,  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)