కేరళకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కైటెక్స్ తెలంగాణలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను కైటెక్స్ గ్రూపు చైర్మన్, ఎండీ సాబ్ ఎం జాకబ్ బృందం మంత్రి కేటీఆర్ తో చర్చించింది. దుస్తుల తయారీ రంగంలో ఈ సంస్థకు మంచి పేరుంది. కేరళ, తమిళనాడులో ఈ సంస్థకు పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక అనుకూల విధానాలు, టైక్స్టైల్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ చెప్పారు.
Post a Comment
0Comments
3/related/default