చేనేత కార్మికులకూ రైతు బీమా తరహా పథకం

Telugu Lo Computer
0



చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు. అందులో చేనేత కార్మికునికి రూ.5లక్షల బీమా అందజేస్తామన్నారు. చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇస్తామన్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించారు. అటు 57ఏళ్లు నిండిన వారందరికీ వృద్దాప్య పింఛన్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పూర్తవగానే కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. గోదావరినే 500 మీటర్లు పైకి తెచ్చాం.. ఎస్సీలను పైకి తేలేమా? ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం అని కేసీఆర్ తెలిపారు. నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నాం అన్నారు. నర్సింగ్‌ ఫస్టియర్ విద్యార్థులకు రూ.5వేలు, సెకండియర్ విద్యార్థులకు రూ.6వేలు, థర్డియర్ విద్యార్థులకు రూ.7వేలు స్టైఫండ్‌ ఇస్తామన్నారు. వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు కచ్చితంగా మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీ కూడా మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే రాజన్న ఆలయం స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సిరిసిల్లలో కమ్యూనిటీ హాలు కోసం రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత మండేపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్, ట్రైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రం, నర్సింగ్‌ కాలేజీలను ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)