సీపీఐ, సీపీఐ(ఎం) నేతల గృహ నిర్బంధం

Telugu Lo Computer
0


ఆస్తి విలువ ఆధారిత పన్ను,  చెత్తపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ విపక్షాలు గురువారం ఆందోళనకు పిలుపునిచ్చాయి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి, చెత్తపై విధించిన పన్నులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా విజయవాడ కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో వీయంసీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వీఎంసీ వద్ద ఆందోళనకు వచ్చిన కొంతమందిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే ముందస్తుగా సీపీఐ, సీపీఐ(ఎం) ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు తలపించే విధంగా కౌన్సిల్ సమావేశానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)