గతనెల 8న ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్న మల్లిక్ వైద్య విలువలు పాటించకుండా కొవిడ్ మూడో దశపై ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడిన కెమికల్ ఇంజినీర్ పరచూరి మల్లిక్ ను అదుపులోకి తీసుకున్నట్టు సుల్తాన్ బజార్ పోలీసులు తెలియజేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు గత నెల 14న సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు బృందం మూడు రోజుల క్రితం వైజాగ్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
Post a Comment
0Comments
3/related/default