చర్చి పేరుతో పాస్టర్ పాడుపనులు

Telugu Lo Computer
0


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఎస్టీ మంగడుకు చెందిన లాల్ షైన్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి పాస్టర్‌గా ఉన్నాడు. అదే ప్రాంతంలోని తన లగ్జరీ బంగ్లాలో ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో చర్చిని  నడుపుతున్నాడు. ఇది కన్యాకుమారిలో ఉన్న పేరున్న చర్చిలలో ఒకటిగా ఉంది. అయితే పాస్టర్‌గా ఉన్న షైన్ సింగ్ ఈ చర్చిలో పాడుపనులు నిర్వహిస్తున్నాడు. కేరళతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. తరుచూ ఈ చర్చి వద్దకు లగ్జరీ కార్లలో అమ్మాయిలు, పురుషులు రావడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వారంతా మోడ్రన్ డ్రెస్సులు ధరించేవారు. చర్చి పేరుతో ఉన్న బంగ్లాలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం పోలీసులకు అందింది.  దాదాపు 15 మంది వరకు పోలీసులు ఆ లగ్జరీ బంగ్లాపై దాడి చేశారు.  మహిళలు, పురుషులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఇద్దరు యువతులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఓ 19 ఏళ్ల యువతిని ఆమె తల్లే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)