తాడేపల్లి ఎస్సైపై యువతి ఆరోపణ

Telugu Lo Computer
0


గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపిస్తూ గుంటూరుకు చెందిన యువతి తల్లితో కలిసి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రహదారిపై బైఠాయించింది. ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సీసా లాక్కుని ఆమెపై నీళ్లు చల్లారు. ఈ వ్యవహారంపై సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ.. 2019లో ఈ సంఘటన జరిగిందని, అప్పట్లోనే  పోలీసులకు యువతి ఫిర్యాదు చేసిందని, దీనిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని తెలిపారు. తాజా ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే యువతి మరోసారి తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో.. ఎస్సై బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)