షాపులు మూసిన అభిమానులు

Telugu Lo Computer
0

 

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్‌ యడ్యూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో యడ్యూరప్ప  మద్దతు దారులు సోమవారం స్వచ్ఛందంగా అన్ని షాపులు, వాణిజ్య సముదాయాలు మూసి బంద్‌ పాటించారు. అనంతరం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అధిష్ఠానం యడియూరప్పతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిందని సొంతూరు షికారిపురలో ఆయన మద్దతుదారులు మండిపడ్డారు. యడ్యూరప్పకు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)