మక్కల్ మండ్రం రద్దు

Telugu Lo Computer
0


గత కొంతకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో అభిమానులతో సమావేశం కావడం దీనికి బలం చేకూరింది. ఈ క్రమంలో రజినీ  ఈరోజు అభిమాన సంఘాలతో భేటీ అయిన తరువాత  మక్కల్ మండ్రంను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమాన సంఘాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసమే మక్కల్ మండ్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే తాను రాజకీయాల్లో లేనప్పుడు దాని అవసరం లేదని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఇది సమయం కాదని చెప్పినట్లు, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా, రారా అని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు. అందుకే అభిమానుల నుంచి సలహాలు తీసుకోవాలని భావించడం జరిగిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)