ఢిల్లీలో కాల్పులు : ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న రాత్రి  ఉత్తర ఢిల్లీలోని బడా హిందూరావ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ముజీబ్‌ అనే ప్రాపర్టీ డీలర్‌ ఈద్గా ప్రాంతంలో నివస్తుంటాడు. అతని మేనమామకు రాణి ఝాన్సీ రోడ్డులోని ఫిలిమిస్తాన్‌లో క్లినిక్‌ ఉంది. గురువారం రాత్రి క్లినిక్‌ క్లోజ్ ఇద్దరూ ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చిన క్రమంలో మామా అల్లుళ్లు ఇద్దరు కారులో కూర్చోగానే.. ఓ యువకుడు వచ్చి వారి కారుకు అడ్డంగా నిల్చున్నాడు. అనంతరం మరో వ్యక్తి అతనితో పాటు కలిశాడు.  దీనిని పసిగట్టన వారు తప్పించుకుని  పారిపోతున్న సమయంలో వారిపై దుండగులు కాల్పులు జరుపగా అటుగా వెళ్తున్నవారికి బుల్లెట్లు తగలడంతో ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని గుర్తించామని, మరొకరు ఎవరనే విషయంపై తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కాల్పులకు తెగబడ్డబడిన వారి కోసం గాలిస్తున్నామని ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)