కొవిడ్ సోకిన తొలివ్యక్తికి రీ-ఇన్‌ఫెక్షన్‌..!

Telugu Lo Computer
0


కేరళకు చెందిన మెడికల్‌ విద్యార్థిని వుహాన్‌ యూనివర్సిటీలో చదువుతోంది. సెమిస్టర్‌ సెలవుల్లో భాగంగా భారత్‌కు వచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆమెకు  2020 జనవరి 30న  వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విద్యార్థినికి  మరలా వైరస్‌ సోకింది.  యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ అంశంపై కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా స్పందించారు. ఆ మహిళ నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. విదేశీ విద్యకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె కరోనా టెస్టుకు వచ్చినట్లు రీనా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు పరీక్ష చేయగా మరోసారి కొవిడ్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రీనా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)