ఐశ్వర్య కుటుంబానికి ఆర్థిక సాయం
July 08, 2021
0
షాద్నగర్కు చెందిన ఐశ్వర్య రెడ్డి లాక్డౌన్ కాలంలో ఫీజులు చెల్లించలేక ఢిల్లీలోని హాస్టల్లో గత నవంబర్ నెలలో ఆత్మహత్య చేసుకుంది. ఐశ్వర్య మరణానంతరం ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో ఐశ్వర్య కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈరోజు ఐశ్వర్య తల్లిదండ్రులను ప్రగతి భవన్కు పిలిపించి రూ. 2.50 లక్షలను కేటీఆర్ అందించారు. షాద్నగర్లో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు హామీ ఇచ్చారు. భవిష్యత్లోనూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఐశ్వర్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.