ప్రైస్ ఎర్రర్‌తో లాభపడిన కస్టమర్లు!

Telugu Lo Computer
0

 

అమెజాన్ సంస్థ చేసిన ఒక పొరపాటు వల్ల చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఏసీలను కొనుగోలు చేశారు. దేశంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం తొషిబా ఎయిర్ కండిషనర్‌ను చాలా తక్కువ ధరకే అందించింది. రూ.96,700గా ఉన్న ఈ ఏసీని 94 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.5900కు అందించింది. తొషిబా స్ప్లిట్ ఏసీ సిస్టమ్‌ను అమ్మకానికి పెట్టేటప్పుడు అమెజాన్ సిబ్బంది చేసిన చిన్న తప్పిదం వల్ల ఇలా జరిగింది. ఈ సంస్థ తమ తప్పిదాన్ని తెలుసుకునే లోపే చాలామంది కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఏసీని కొనుగోలు చేసేశారు. అసలైతే రూ.96,700 ఉన్న ఈ ఏసీని డిస్కౌంట్ గా 90,800 రూపాయలకు అందించాలి. రూ.5900 డిస్కౌంట్ కి బదులు అమెజాన్ సిబ్బంది అసలు ధరనే రూ.5900 గా నిర్ణయించడంతో చాలామంది ఎగబడి ఏసీలు కొనేశారు. దీనిని  నెలకు రూ. 278 రూపాయల నుంచి ఈఎంఐ కూడా అందించింది అమెజాన్.

Post a Comment

0Comments

Post a Comment (0)