హైతీ అధ్యక్షుడు దారుణ హత్య
July 07, 2021
0
హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్ మోసె దారుణ హత్యకు గురయ్యారు. తన ప్రైవేట్ నివాసంలో ఉన్న మోసెను మంగళవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని సాయుధ వ్యక్తుల బృందం హత్య చేసినట్లు తాత్కాలిక ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్ ఓ ప్రకటనలో ప్రకటించారు. ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాట్లాడే విదేశీయులు అధ్యక్షుడిని తన ఇంటి వద్ద హత్య చేశారని జోసెఫ్ చెప్పారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అధ్యక్షుడి సతీమణి మార్టిన్ మోసెని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని క్లాడ్ జోసెఫ్ తెలిపారు.