అలాంటి వాళ్లుంటే వెళ్లిపోండి

Telugu Lo Computer
0


నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ రెడ్డి  హామీ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఇబ్బంది పెట్టే వారి డైరీ రాస్తున్నామని, వేధించిన అధికారుల మోకాలి చిప్పలు పగల గొట్టిస్తామని హెచ్చరించారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని, చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)