ఎస్ఎమ్ఎస్ ల రద్దు ?
July 31, 2021
0
అన్ని ప్రముఖ మొబైల్ నెట్వర్క్లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్లాన్లను రద్దు చేస్తూ యూజర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎయిర్టెల్ తన ఎంట్రీ లెవల్ రూ. 49 ప్లాన్ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్, జియో సంస్థలు కూడా ఎంట్రీ లెవల్ ప్లాన్ల కింద లభించే బెనిఫిట్స్ తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. రూ. 100లోపు లభించే ప్లాన్లపై ఉచిత బండిల్ ఎస్ఎమ్ఎస్లను రద్దు చేసే ప్లాన్లో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని టెలికాం ఆపరేటర్లు దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.