పెరుగుతున్న కరోనా కేసులు

Telugu Lo Computer
0


వచ్చే నెలలో ధర్డ్‌వేవ్‌ మొదలు కానుందన్న ఆందోళన మధ్య దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదల బెంబేలెత్తిస్తోంది. గురువారం ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 45, 892 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. బుధవారంతో పోల్చుకుంటే 5 శాతం అదనంగా కేసులు నమోదయ్యాయి. మరో 817 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,07,09,557 మంది కరోనా బారిన పడగా...కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 4,05,028గా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో 4,60,704 క్రియా శీలక కేసులున్నాయి. రికవరీల సంఖ్య 2,98,43,825కు చేరింది. గత 24 గంటల్లో 33,81,671 మంది కరోనా టీకాలు తీసుకోగా, ఆ సంఖ్య 36,48,47,549 మందికి చేరువైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)