ఒకే నెలలో ఏడోసారి వడ్డన !

Telugu Lo Computer
0


రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడమే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదలకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరల భారం సామాన్యులపై పడుతోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటి దూసుకెళుతున్నాయి. జూలై నెలలో వరుసగా ఏడోసారి ఇంధన ధరలు పెరిగాయి. ఈరోజు చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 35 పైసలు పెరిగింది. ఇక డీజిల్ 26 పైసలు పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.86గా ఉంది. డీజిల్‌ ధర రూ.97.96కు చేరింది.  విజయవాడలో పెట్రోల్‌ ధర 107.07 ఉంటే, డీజిల్‌ ధర రూ.99.60కు చేరుకుంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64గా ఉంటే, డీజిల్‌ ధర రూ.99.15కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)