అత్యవసర పరిస్థితి దృష్ట్యా కేరళ ప్రభుత్వం మళ్లీ పూర్తి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. అది కూడా జూలై 17, జూలై 18 తేదీల్లో వారంతపు లాక్డౌన్ విధించింది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను మళ్లీ విధించింది. ఈ కొత్త కరోనా ఆంక్షలు గురువారం (జూలై 15) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. ఒకవైపు జికా వైరస్ వణికిస్తుండగా.. మరోవైపు రోజువారీ కొత్త కరోనా కేసులు వేలసంఖ్యలో నమోదవుతున్నాయి.
Post a Comment
0Comments
3/related/default