చిత్రహింసలు పెడుతున్నాడు!

Telugu Lo Computer
0


‘సుందర ట్రావెల్స్’ సినిమాతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రాధ తన రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల క్రితం ఎన్నూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకుంది రాధ. ఈ క్రమంలో తన భర్త దారుణంగా వేధిస్తున్నాడని.. చంపుతానని బెదిరిస్తున్నాడంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత ఇద్దరూ కాంప్రమైజ్ అవ్వడంతో ఇచ్చిన కంప్లైంట్ ను ఉపసంహరించుకుంది రాధ. ఇప్పుడు మరోసారి తన భర్త తనపై అనుమానం పెంచుకొని తీవ్రంగా కొడుతున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం నాడు పరంగిమలైలోని జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేసింది రాధ. తన భర్త అతడి స్నేహితులు, బంధువులతో కలిసి తనను తీవ్రంగా హింసిస్తున్నారని రాధ పేర్కొంది. తన భర్తపై అతడి స్నేహితులైన సబ్ ఇన్స్పెక్టర్ భర్త, ఇళంవరుదిలపై చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను కోరింది.


Post a Comment

0Comments

Post a Comment (0)