ఆంధ్రప్రదేశ్ రాజధాని అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ బుధవారం జరిగింది. విచారణకు దళిత రైతు పోలా రవి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆర్కే తనపై కక్ష పూరితంగా వ్యవహరించారని ఆరోపించాడు. దళితుడిగా తన భూమిని అమ్ముకునే హక్కులేదా? అని ప్రశ్నించాడు. అమ్ముకున్న పొలం విషయమై తనను సీఐడీ ప్రశ్నించిందని, తాను ఐదుగురికి సాక్షి సంతకాలు పెట్టానంటే.. సీఐడీ వాళ్లు 51 మందికి సాక్షి సంతకం పెట్టానంటున్నారని అన్నాడు. తాను చదువుకోలేదని, వాళ్లు పెట్టమన్నచోట సంతకం పెట్టానని రవి తెలిపాడు.