ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన యువ జవాన్ జశ్వంత్రెడ్డి (23) వీర మరణం పొందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన త్యాగం మరువలేనిదన్నారు. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వాసి జశ్వంత్ రెడ్డి అమరుడయ్యారు.