టాక్సీ డ్రైవర్ కు రూ.40 కోట్ల లాటరీ !

Telugu Lo Computer
0

 కేరళ టాక్సీ డ్రైవర్ కి లాటరీలో రూ.40 కోట్లు..! | Site Telugu 

అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన  రెంజిత్ సోమరాజన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ట్యాక్సీ డ్రైవర్ అయిన రెంజిత్ సోమరాజన్(37) మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి సోమరాజన్ ఉప్పొంగిపోయాడు. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు. తొమ్మిది మందికి ఒక్కొక్కరికి రూ.3 కోట్లపై వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)