రూ.3 లక్షలు గెల్చుకోండి!

Telugu Lo Computer
0


ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో వెబ్ సైట్ లేదా యాప్‌లో బగ్ కనిపెడితే లక్షల రివార్డ్ ఇస్తామంటోంది. బగ్ బౌండీ ప్రొగ్రామ్ కింద బగ్ కనిపెట్టిన వారికి (4వేల డాలర్లు) రూ.3 లక్షల గెల్చుకోవచ్చుంటూ ఆఫర్ చేస్తోంది. జొమాటో టెక్నాలజీ రీసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు ఆఫర్ అందిస్తోంది. ఐపీఓ  ప్రమోషన్‌, యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్‌పెట్టేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను గుర్తించిన వారికి ఈ రివార్డును ఇవ్వనుంది. జూలై 8న అధికారికంగా ఈ ఆఫర్ ప్రకటించింది. బగ్స్‌ ఫిక్స్ చేయడాన్ని బట్టి రివార్డు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంటుందని జొమాటో సెక్యూరిటీ ఇంజనీర్‌ యష్‌ సోధా  ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)