కేరళలోని తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. కేరళలో ఇప్పటివరకు 15 జికా వైరస్ కేసులు గుర్తించడంతో అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్ బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్ (రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం) వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది. ఇంతకుముందు 2016-17లో గుజరాత్లో జికా వైరస్ కేసులు గుర్తించారు.