దేవెగౌడకు భారీ జరిమానా

Telugu Lo Computer
0



2011 జాన్ 28న ఒక కన్నడ చానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో    నైస్ సంస్థపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సంస్థ పరువుకు భంగం వాటిల్లిందని ఆ కంపెనీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపి  దేవగౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని  సివిల్​ కోర్ట్​ జడ్జి మల్లన గౌడ ఆదేశించారు.

అయితే, ఇదే కేసులో గతంలో ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించిన సిటీ సివిల్​ అండ్​ సెషన్స్​ కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)