మహిళ హత్య

Telugu Lo Computer
0


ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మూలగూడెం తండాకు చెందిన నునావత్ సుశీల (36)  ఓ కిరాణా దుకాణం నడుపుకుంటూ ఒంటరి జీవనం సాగిస్తోంది. అదే  గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. కావాలనే ఆమెను చూసేందుకు ఏదో ఒకటి కొంటూ దుకాణానికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే జూన్ 24న రాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి దూరాడు. ఈ సమయంలో తన ఇంటికి ఎందుకొచ్చావని ఆమె నిలదీసింది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లాలని, లేకపోతె మీ తల్లిదండ్రులకు, ఊళ్లో పెద్దలకు చెబుతానని హెచ్చరించింది.  ఆమె బయట చెబితే ఎక్కడ తన పరువు పోతుందోనని భావించిన వెంకటేశ్వర్లు క్షణికావేశంతో సుశీల తలపై అందుబాటులో ఉన్న రాయితో కొట్టాడు. ఈ దాడిలో సుశీల తీవ్రంగా గాయపడింది. రక్తస్రావం ఎక్కువ కావడంతో కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. సుశీల హత్య కేసును విచారించిన సందర్భంలో పోలీసులకు వెంకటేశ్వర్లు వ్యవహార శైలిపై అనుమానమొచ్చింది. దీంతో తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ఆమె తన కోరిక తీర్చకపోవడం, ఆ విషయాన్ని ఊళ్లో చెబుతానని బెదిరించడంతో పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)