సంతోష్ బాబు విగ్రహావిష్కరణ !

Telugu Lo Computer
0


భారత్‌-చైనా సరిహద్దు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబ‌డి చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గతేడాది జూన్‌ 15న వీరోచితంగా పోరాడి అమ‌రుడైన కల్న‌ల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని ఈరోజు  సూర్యాపేట‌లో తెలంగాణ రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.  సూర్యాపేట కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్న‌ల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని నేలకొల్పారు.  

కల్న‌ల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం త‌రుపున‌ 5 కోట్ల రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు,  సీఎం కేసిఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం సంతోష్‌బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీచేయ‌డంతో పాటు, ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)