అన్నదమ్ముల మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ ఢీ కొని రాజు అనే వ్యక్తి మృతిచెందాడు. తమ్ముని మరణ వార్త తెలుసుకుని వస్తున్న అన్నకూ ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ప్రమాదంలో అన్న మృతి చెందాడు. గంట వ్యవధిలో అన్నదమ్ముల మృతితో విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)