ఎడ్ల బండ్లతో కళ్యాణ మండపానికి.... !

Telugu Lo Computer
0

 


దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాయు కాలుష్యం దృష్ట్యా ఉత్తర్​ప్రదేశ్ దేవరియాకు చెందిన వరుడు ఛోటే లాల్ ఎడ్ల బండిపై కళ్యాణ మండపానికి వచ్చాడు. అతనితో పాటు పెళ్లి బృందం కూడా ఎడ్ల బండ్లు కట్టుకుని మండపానికి రాగా రోడ్డు మార్గం అంతా సందడి నెలకొంది.

ఛోటే లాల్ గ్రామం కుషారీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్​లో పెళ్లి మండపం ఉంది.

తనకు చిన్నప్పటి నుంచి ఎద్దుల బండిపై వచ్చి వివాహం చేసుకోవాలని ఉండేదని ఛోటే లాల్ తెలిపాడు. ఈ విధానం వల్ల సంస్కృతి, సంప్రదాయాన్ని పెంపొందించటం సహా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరూ ఖర్చులను తగ్గించుకోవాలని హితవు పలికాడు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)