ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల
దేశరాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్కు
చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ..
ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి
మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. త్వరలోనే ఈ
నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని వివరించారు.
Post a Comment
0Comments
3/related/default