ఇండిగో టికెట్‌పై డిస్కౌంట్

Telugu Lo Computer
0

దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో  వైరస్ కు చెక్ పెట్టడానికి కేంద్రం  వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.  ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చాలా మంది వ్యాక్సిన్ ఇప్పించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో కొన్ని సామాజిక సంస్థలు, ఇతర కంపెనీలు పలు తాయిలాలు  ప్రకటిస్తు న్నాయి. 
విమానయాన రంగంలో ఉన్న ఇండిగో ఒక  ఆఫర్ ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. జాతీయ టీకా పంపిణీ విధానానికి తమ వంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)