ఓలా సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్కూటర్ కోసం పెయింట్ ఆర్డర్ చేయాల్సిన సమయం వచ్చేసిందని ఎలాంటి కలర్ కోరుకుంటున్నారంటూ ట్విటర్ వేదికగా ఆయన ఔత్సాహికులను అడిగారు. దీంతో స్కూటర్ తయారీ పూర్తయిందని అందుకే పెయింట్ గురించి అడుగుతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న కొన్ని వారాల్లో వీటి ధరల్ని సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిమూవబుల్ లిథియం ఐయాన్ బ్యాటరీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, క్లౌడ్ కనెక్టివిటీ, అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్లో ఉండనున్నట్లు సమాచారం.