విజయవాడ దుర్గ అగ్రహారంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. కత్తులతో విచక్షణా రహితంగా నరకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కండ్రికకు చెందిన రామారావు గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆర్ధిక విభేదాలా ? వివాహేతర సంబంధమా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.