నాలుగో రోజు వరుణుడుదే !

Telugu Lo Computer
0


భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం   నుండి   ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో రెండు సెషన్ల పాటు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. దీనితో మొదటి రోజు లాగానే నాలుగో రోజు కూడా ఒక బంతి  కూడా వేయకుండానే ఆట రద్దైయింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్,  భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. బౌలింగ్ కు బాగా అనుకూలిస్తున్న పరిస్థితుల్లో భారత్  తొలి ఇన్నింగ్స్ లో అతికష్టమ్మీద 217 పరుగులు చేయగలిగింది. ఆపై బరిలో దిగిన కివీస్ మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉన్నారు. క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ ఉన్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, ఇషాంత్ చెరో వికెట్ తీశారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)