విజన్ ఎస్టేట్ అగ్రిగోల్డ్‌కు బినామీ కాదు

Telugu Lo Computer
0


తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆమోదం తెలిపింది. ఎస్‌బీఐ వేలంలో 1401 చ.గ. భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకుంది. అగ్రిగోల్డ్‌కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్  సీఐడీ తెలిపారు. వాస్తవ ధర కన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని ఆంధ్రప్రదేశ్  సీఐడీ పేర్కొంది. వాస్తవ ధరకన్నా తక్కువేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం పేర్కొంది. ఇప్పటికి మూడు సార్లు వేలం వేసినా విజన్ ఎస్టేట్ మాత్రమే పాల్గొన్నదని ఎస్‌బీఐ తెలిపింది. మూడు సార్లు వేలం నిర్వహినందున ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఎక్కువ ధరకు కొనే వారిని తీసుకురాలేక పోయిందని హైకోర్టు పేర్కొంది. విజన్ ఎస్టేట్స్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)