ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం తిరుపతిలో డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స అందించామని అతడి నుండి  ఈ వేరియంట్ ఇతరులెవరికీ వ్యాప్తి చెందలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ నిర్వహించిన భేటీలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని  ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తతో వుండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)