కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ నిబంధనలు, వ్యాక్సినేషన్ కారణంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్న ప్రచారం కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఓ హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు. వ్యాక్సిన్ వేయించుకుని సర్టిఫికెట్తో తన వద్దకు వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్తో హెయిర్ కట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను ఈ ఆఫర్ ఇచ్చానని, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే అందరం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సెలూన్ యజమాని కార్తికేయన్ పేర్కొన్నాడు.
విన్నూతన ఆఫర్ !
June 21, 2021
0
కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ నిబంధనలు, వ్యాక్సినేషన్ కారణంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్న ప్రచారం కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఓ హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు. వ్యాక్సిన్ వేయించుకుని సర్టిఫికెట్తో తన వద్దకు వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్తో హెయిర్ కట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను ఈ ఆఫర్ ఇచ్చానని, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే అందరం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సెలూన్ యజమాని కార్తికేయన్ పేర్కొన్నాడు.
Tags