తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్డెత్పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు 15 లక్షలు, ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు.