జగన్ ఇంటి వద్ద హై అలర్ట్ !
June 19, 2021
0
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం పరిధిలో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తాడేపల్లిలో ఆయన నివాసం, పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం శనివారంతో 550వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి పరిసరాల్లో నివాసం ఉండే వారు కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు రాజధాని రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Tags