కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు విరాళాలు వెల్లువులా వచ్చాయి. కార్పొరేట్, వ్యాపార రంగాల నుంచి, గుర్తు తెలియని వర్గాల నుంచి ఆ పార్టీకి మిగిలిన పార్టీలకన్నా ఎక్కువగా విరాళాలు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రూ . 276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 58 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించిన కంపెనీలలో జేఎస్ డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్, డిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, డిఎల్ ఎఫ్ గ్రూపులు ఉన్నాయి. భాజపా, కాంగ్రెస్ కాకుండా మరో 12 పార్టీలకు ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రూ . 25.46 కోట్లు అందాయి.
Post a Comment
0Comments
3/related/default