కరోనాతో పోరాడుతూ సీనియర్ నటి కవిత భర్త దశరథ రాజు మరణించారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితమే ఆమె కుమారుడు సంజయ్ రూప్ సైతం కరోనాతో పోరాడుతూ మృతిచెందారు. దశరథ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత దాదాపు 350 చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.