కాల్పుల కలకలం

Telugu Lo Computer
0


కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పులు  కలకలం సృష్టించాయి.  ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిని కాల్చి చంపి ఆపై తాను కూడా అదే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆస్తి వివాదాలే ఇద్దరి మధ్య గొడవలకు కారణమని అనుమానిస్తున్నారు. ఇరు కుటుంబాల వారూ వైసీపీకి చెందిన వారేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)