విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఆ యువతి తనకు ప్రియుడితో వివాహం జరిపించాలని, లేదంటే దూకుతానని బెదిరిస్తోంది. రవి అనే యువకుడిని తాను ప్రేమిచానని, అతడు తనను మోసం చేశాడని ఆరోపిస్తుంది యువతి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని యువతిని కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. తన ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది.