మరో 5 నెలలు ఉచిత రేషన్

Telugu Lo Computer
0

 


ప్రధాన్ మంత్రి గరీభ్​ కల్యాణ్​​ యోజన పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. లబ్దిదారులైన ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రానికి రూ.64,031కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.  గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)