టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు !

Telugu Lo Computer
0

 


హిమాచల్​ ప్రదేశ్​ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ ​కుమార్​ అనే వ్యక్తి రోడ్డు ప్రక్కన టీ కొట్టు పెట్టుకొని నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకు కలిపి అతనికి రూ. 6,702 బిల్లు వేసింది  వచ్చింది. దానిని అతను ఆర్థిక ఇబ్బందులు కార‌ణంగా చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి క‌రెంట్​ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్​లైన్​లో చెల్లించాలని పోర్టల్​లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి అత‌డు నిర్ఘాంతపోయాడు.  అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. వెంటనే  అతను విద్యుత్​ బోర్డ్​ అధికారులను ఆశ్రయించాడు. పొరపాటుగా  ఎక్కువ చుపిస్తోందని సరిచేస్తామని చెప్పారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)