హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రక్కన టీ కొట్టు పెట్టుకొని నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకు కలిపి అతనికి రూ. 6,702 బిల్లు వేసింది వచ్చింది. దానిని అతను ఆర్థిక ఇబ్బందులు కారణంగా చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్లైన్లో చెల్లించాలని పోర్టల్లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి అతడు నిర్ఘాంతపోయాడు. అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. వెంటనే అతను విద్యుత్ బోర్డ్ అధికారులను ఆశ్రయించాడు. పొరపాటుగా ఎక్కువ చుపిస్తోందని సరిచేస్తామని చెప్పారు.