బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం

Telugu Lo Computer
0


తాడేపల్లి మండలం సీతానగరం, పుష్కర్ ఘాట్లో   లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ,  ఘటన హేయనీయమని అన్నారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్న తెలిపారు. బాధితురాలికి తక్షణ సాయంగా సీఎం జగన్‌ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారని వెల్లడించారు. మహిళా శిశుసంక్షేమశాఖ తరఫున మరో రూ. 50 వేలు అందిస్తామని ఆ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న హోం మంత్రి సుచరిత అన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)