టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చింది. కరోనా వలన మరణించిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది. సోషల్మీడియా ద్వారా ప్రకటించింది.
ఇక కంపెనీలో పనిచేస్తూ కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్లైన్ వర్కర్ల పిల్లల గ్రాడ్యుయేషన్ చదువుల వరకు కంపెనీయే మొత్తం ఖర్చును భరించనున్నది. నెల వేతనం అందించడంతో పాటు ఫ్రంట్లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. జంషేడ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆన్లైన్ వేదికగా నెటిజన్లు టాటా సంస్థ, సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాను ప్రశంసిస్తున్నారు.