అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ... సీఎస్ఐఆర్, నేషనల్ ఏరోస్సేస్ ల్యాబ్స్ సహకారంతో పోర్టబుల్ వెంటిలేటర్ ను రూపొందించింది. 'స్వస్థ్ వాయు ఇన్వాజివ్ వెంటిలేటర్' గా దీనికి పేరు పెట్టారు. బ్రీఫ్ కేసు పరిమాణంలో వుండే ఈ వెంటిలేటర్ మూడు కిలోల కన్నా తక్కువ బరువు ఉంటుంది. దీనిని ఇంటిలో కూడా వాడుకోవచ్చు.
హైదరాబాదుకు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అధినేత బద్దం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాదుతో పాటు బెంగళూరు నగరంలోనూ ఈ మినీ వెంటిలేటర్ ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్టు, కరోనా బాధితులే కాకుండా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉపయోగించవచ్చని తెలియజేశారు.